ఫేస్బుక్ ప్రధాన కార్యాలయానికి మోదీకి ఆహ్వానం
హైదరాబాద్,సెప్టెంబర్ 13 (జనంసాక్షి):
అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 27న అక్కడి ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. భారత ప్రధాని తమ కార్యాలయానికి వస్తున్నట్లు ఫేస్బుక్ సీఈవో జుకర్ బర్గ్ స్వయంగా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం సెప్టెంబర్ 27 ఉదయం 9.30 నిమిషాలకు మోదీ ఫేస్బుక్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ౌ్ఠన్హాల్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోదీని గతంలో తాను కలిశానని, ఇలా మరోసారి తమ సొంత కార్యాలయంలో కలవబోతున్నందుకు సంతోషంగా ఉందంటూ జుకర్బర్గ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీతో కలిసి దిగిన ఫొటోను జుకర్బర్గ్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. జుకర్బర్గ్ ఆహ్వానానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.