ఫ్రెంచ్‌ ఓపెన్‌ నా లక్ష్యం

1
– సానియా మీర్జా

హైదరాబాద్‌,ఫిబ్రవరి 1(జనంసాక్షి): వరుస విజయాలు సాధించటం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియావిూర్జా అన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌లో విజయం సాధించిన అనంతరం హైదరాబాద్‌ చేరుకున్న ఆమె తన నివాసంలో విూడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఆరంభంలోనే మంచి విజయాలు దక్కాయి. ఓ టెన్నిస్‌ క్రీడాకారిణి లేదా ఓ క్రీడాకారుడు 6 నెలల సమయంలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఉండడమంటే చాలా కష్టమనే చెప్పగలను. ఈ సమయంలో హింగిస్‌తో కలిసి బాగా ఆడా. నా క్రీడాజీవితంలో ఇంత సుదీర్ఘ కాలంపాటు విజయాల పరంపర కొనసాగించడం ఇదేనని చెప్పగలను’ అని అన్నారు. తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నానన్న సానియా, గెలిచినప్పుడు సోషన్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో అసంఖ్యాక సందేశాలు వస్తాయని, ఓడినప్పుడు తిట్లకూ కొదవ ఉండదని అభిప్రాయ పడింది. మహిళల డబుల్స్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించడమే తన తదుపరి లక్ష్యమని సానియా విూర్జా వ్యాఖ్యానించింది. ‘నా తదుపరి లక్ష్యం కచ్చితంగా ఫ్రెంచ్‌ ఓపెనే. అది గెలిస్తే నా లక్ష్యం పూర్తవుతుంది. అయితే అంత సులభం కాదు. నిజాయితీగా చెప్పాలంటే అది మాకు అన్నింటికంటే కష్టమైన వేదిక. నేనూ, హింగిస్‌ ఇద్దరమూ క్లే కోర్టులో బలహీనం. అయితే తీవ్రంగా శ్రమించి సాధించాలనే పట్టుదలగా ఉన్నాం’ అని సానియా చెప్పింది. 2015 అద్భుతంగా గడిచిందని, ఈ ఏడాది అదే జోరు కొనసాగిస్తే చాలనుకున్న తనకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో అద్భుతమైన ఆరంభం లభించిందన్న సానియా, 2016లో కనీసం మరో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గుతామని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘మా ఇష్టాఇష్టాలు కూడా కలవడంతో కోర్టు బయట కూడా మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇది అక్కాచెల్లెళ్ల మధ్య బంధంలా మారింది. ఆమెకు ప్రత్యర్థిగానే మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెవిూస్‌ ఆడాల్సి రావడంతో ఎంతో భావోద్వేగానికి గురయ్యాం. లాకర్‌ రూమ్‌లో కలిసినప్పుడు ఏడుపొక్కటే తక్కువ. మరుసటి రోజు ఇద్దరం కలిసి మళ్లీ ఫైనల్స్‌ ఆడాల్సి రావడం అంటే అది ఎలాంటి సమయమో అర్థం చేసుకోవచ్చు’ అని సానియా చెప్పింది. ‘పేస్‌, బొపన్నలలో ఎవరితో కలిసి ఆడాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. దానికి చాలా సమయముంది. కటాఫ్‌ తేదీనాటికి నేను టాప్‌-10లో ఉంటానని నమ్మకముంది గానీ వారిద్దరి ర్యాంకింగ్‌ గురించి నేను చెప్పలేను. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పతకానికి ఎంత అవకాశం ఉందో…ఫెడరర్‌, జొకోవిచ్‌లాంటి ఆటగాళ్లు బరిలోకి దిగితే ఓడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది’ అని విూర్జా విశ్లేషించింది. భారత ప్రభుత్వం తనకు పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించడం పట్ల సానియా అమితానందం వ్యక్తం చేసింది. ‘నాకు ముందుగా సమాచారం లేదు. నేను ఈ అవార్డును ఊహించలేదు. ట్విట్టర్‌లో కొంత మంది అభినందించడం ప్రారంభించడంతో తెలిసింది. ఆ తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి అధికారికంగా ఫోన్‌ వచ్చిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఏ అవార్డు గొప్పతనం దానిదే. ఇటీవల న్యూయార్క్‌నుంచి వచ్చి మరీ ఖేల్‌ రత్న అందుకున్నా. ఈ సారీ టోర్నీ లేకపోతే ఎక్కడున్నా వచ్చి తీసుకుంటా’ అని వెల్లడించింది.కేంద్ర ప్రభుత్వం తనకు పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించటంపై సంతోషం వ్యక్తం చేసిన సానియా.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో
అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు.