ఫ్లైఓవర్ కూలి 10 మంది మృతి

99

కోల్ కతాలో ఘోర ప్రమాదం జరిగింది. వివేకానంద రోడ్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలి 10 మంది మృతి చెందారు. రద్దీగా ఉండే గణేష్ థియేటర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. శిథిలాల కింద 150 మంది దాకా ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ బ్రిడ్జీ గత మూడు సంవత్సరాలుగా నిర్మాణం జరుపుకుంటోంది.