బంక్ లో జనరేటర్ ఏర్పాటు చేయాలి గంగారాం మండల ప్రజల విజ్ఞప్తి

గంగారం అక్టోబర్ 14 (జనం సాక్షి)
గంగారం మండల కేంద్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ లలో జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భారత్ పెట్రోల్ బంక్ లో డీజిల్ ఉంటే కరంట్ ఉండదు , కరంట్ ఉంటే డీజిల్ ఉండదని ఆవేధన వ్యక్తంచేస్తున్నారు. పలు మార్లు బంక్ యాజమాన్యం కు పిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మండల ప్రజల విజ్ఞప్తి మేరకు తక్షణమే యాజమాన్యం స్పందించి జనరేటర్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు