బంజారా భవన్ ప్రారంభోత్సవానికి తరలిన మండల వాసులు

తొర్రూరు:16 సెప్టెంబర్ (జనంసాక్షి )
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో బంజారా భవన్ ప్రారంభోత్సవానికి మండల వాసులు తరలి వెళ్లారు.వాహనాలను తొర్రూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో సింగారపు కుమార్,మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య,కమిషనర్ గుండె బాబు గిరిజన నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ జయసింగ్ నాయక్, టిఆర్ఎస్ ఎస్టి సెల్  మండల అధ్యక్షుడు జాటోత్ స్వామి నాయక్ లు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు.బంజారాల ఆత్మగౌరవం నిలిపేలా సీఎం కేసీఆర్ బంజారా భవన్ ను గిరిజనులకు కానుకగా ఇచ్చారని తెలిపారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని తెలిపారు.తండాల్లోని కొత్త గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు.నడిచి కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న తండాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, విద్యా వసతులు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు.గిరిజన యూనివర్సిటీ కోసం స్థలం కేటాయించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.  గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్, ఆదివాసీల పోరాటయోధుడు కుమరం భీమ్ స్మారక భవనాలను సైతం సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. గిరిజనుల కోసం ఆలోచించిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు.గిరిజనుల అభివృద్ధి , సంక్షేమం టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమని స్పష్టం చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించడం లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుగులోతు శంకర్ నాయక్,గిరిజన సర్పంచ్ లు మాలోత్ కాలు నాయక్, బానోత్ యాకమ్మ కిషన్ నాయక్, జాటోత్ కౌసల్య బోజ్య,జాటోత్ విజయ్ కుమార్,హపావత్ సురేష్,గుగులోతు సరస్వతి, పాడ్యా రమేష్,జాటోత్ శారదా రమేష్, లకావత్ శోభన యాకూబ్, సోమ్లా నాయక్, ఎంపీటీసీ జాటోత్ సుజాత రాజేందర్, జర్నలిస్టు లకావత్ యాదగిరి నాయక్,టిఆర్ఎస్ ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు రమేష్ నాయక్, టిఆర్ఎస్ నాయకులు జాటోత్ సాయి కృష్ణ, బాలు నాయక్, ఎల్ఐసి డివో శంకర్, గిరిజన ఉపాధ్యాయులు ధరావత్ కిషన్ నాయక్,శంకర్ నాయక్, యూత్ నాయకులు భానోత్ ప్రవీణ్ నాయక్ శశికుమార్, శ్రీనివాస్, రవీందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు