బడ్జెట్‌ కలగూరగంప

4

– నిర్దిష్ట లక్ష్యాలు లేవు

– మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29(జనంసాక్షి):కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పట్ల మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదొక కలగూర గంప బడ్జెట్‌ అన్నారు. ఈ బడ్జెట్‌ వెనుక పెద్ద ఆలోచనేది చేయనట్లు కనిపిస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయాలు రెండింతలు అవుతాయని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ ద్వారా చెప్పిందని.. అది ముమ్మాటికీ సాధ్యం కాని ఐడియా మాత్రమే అన్నారు. ఇది మిశ్రమ అంశాలతో నింపిన సంచిలాంటి బడ్జెట్‌. ప్రధాని నిన్న ప్రకటించిన ఒక ఐడియా తప్ప దీని వెనుక పెద్ద ఆలోచనేది చేయనట్లు కనిపిస్తోంది. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం డబుల్‌ అవుతుందని చెప్పారు. అది తీరే కలమాత్రం కాదు. పోని ఎలా సాధిస్తారో కూడా వివరించలేదు’ అని మన్మోహన్‌ సింగ్‌ స్పందించారు. ఇకపోతే అరుణ్‌ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పై ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే పెదవి విరిచారు. ఈ బడ్జెట్‌ లో సామాన్యులకు ఎటువంటి ఉపశమనం లేదని అన్నారు. ఎట్టకేలకు పారిశ్రామికవేత్తలకు కాస్త ఉపశమనం కలిగేలా చూశారని చిరకాలంగా ఉన్న రైతుల రుణమాఫీ డిమాండ్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో గ్రావిూణ ఉపాధి హావిూ కింద

వేతనాలు పెరిగేందుకు ఏమాత్రం ఉపయోగపడిందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో  ఉపాధి హావిూకి 40,000 కోట్లు ఇచ్చిందన్నారు. దాంతో పోలిస్తే ఈ బడ్జెట్‌ పెద్ద విషయమేవిూ కాదన్నారు. మొత్తం కేటాయింపులు ఎంత పెరిగాయన్నది ముఖ్యం కాదని, వేతనాల్లో ఎంత పెరిగిందన్నది పోల్చి చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.  రోజుకూలి 100 రూపాయలు ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం 40 వేల కోట్లు మంజూరు చేసిందని, ఇప్పుడు రోజు కూలి 150కి మారిందని అన్నారు. అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ఒక్క డబ్బు విషయాన్నే పరిగణలోకి తీసుకుందని, భౌతిక భాగాన్ని పరిశీలించలేదని ఖర్గే విమర్శించారు. ముఖ్యంగా బడ్జెట్లో మహిళలు, యువతకు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదంటూ  కాంగ్రెస్‌ నేత ఖర్గే విమర్శలు ఎక్కుపెట్టారు.