బర్త్డే వేడుకలకు దూరంగా కమల్
చెన్నై,నవంబర్7(జనంసాక్షి): రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విలక్షణ నటుడు కమల్ హాసన్ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. కొంతకాలంగా భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బర్త్డే వేడుకలు రద్దు చేసుకున్నారు. ఇది కాల్వలు తవ్వి నీటిని బయటకు పంపే సమయమని, కేక్ కోసే సమయం కాదని కమల్ వ్యాఖ్యానించారు. వేడుకలకి బదులు చెన్నైకి ఇరవై కిలోవిూటర్ల దూరంలో ఉన్న వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఆ తర్వాత భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు. కమల్హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న నేపథ్యంలో ఆయన తన బర్త్డే రోజే పార్టీ వివరాలు వెల్లడిస్తారని వార్తలు వెలువడ్డాయి. కానీ అలాంటిదేవిూ లేదని తర్వాత కమల్ వివరణ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా తన పేరిట మొబైల్ యాప్ సేవలు అందించనున్నారు. ఈ యాప్ ద్వారానే ప్రజలతో తన రాజకీయ ప్రణాళికల
గురించి చర్చిస్తారని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం రాత్రి తన బర్త్డే వేడుకల గురించి ట్వీట్ పెట్టారు. నన్ను ఇష్టపడేవారికి, పుట్టినరోజు వేడుకలు క్యాన్సిల్ చేసినందుకు బాధపడుతున్నవారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. బర్త్డే జరుపుకొంటే కేవలం ఆరోజుకే వేడుకలు పరిమితమవుతాయి. దాని బదులు ఏదన్నా సేవ చేస్తే మనం కోరుకున్న మార్పు వస్తుంది’ అని ట్వీట్లో పేర్కొన్నారు.