బస్సు నదిలో పడి 21 మంది మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బస్సు వంతెన నుంచి నదిలో బోల్తాపడి సుమారు 21 మంది మృత్యువాత పడ్డారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. పెళ్లి బృందం చిన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బస్సు సోనే నదిపై ఉన్న వంతెన పై నుంచి పడిపోయింది. బస్సులో చాలా మంది ఇరుక్కుపోయారని అధికారులు తెలిపారు.