బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు మృతి

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన ఓర్వకల్లు మండలం పూడిచర్లలో  చోటుచేసుకుంది. బస్సు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై వెళ్తోన్న ఇద్దరు మృతి చెందారు. ఓ పత్రికకు చెందిన విలేకరి వి.ఎల్‌. రవికుమార్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ నాగశంకర్‌ నాయక్‌లు బైక్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.