బస్సు బోల్తా : 15 మందికి గాయాలు

నల్గోండ : బస్సు బోల్తాపడి పదిహేను మందికి గాయలైన ఘటన చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు. 108 సాయంతో వారిని సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తెలిసింది.