బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది

9pjygfjiఢిల్లీ, బెంగళూరు ఎయిర్‌ పోర్ట్ లో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. దాదాపు 6 ఇంటర్నేషనల్‌ ప్లేన్‌ లలో బాంబులు ఉన్నట్లు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో ఢిల్లీ, బెంగళూరు ఎయిర్ పోర్ట్ లలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి అన్ని ఫ్లైట్లలో సోదాలు నిర్వహించింది. అటు టేకాఫ్ అయిన 3 విమానాలను సైతం వెనక్కి రప్పించారు. ఐతే ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. చివరికి ఇది ఫేక్ కాల్ అని గుర్తించారు. సోదాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అటు ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారు.