బాధితురాలిపై ఆస్పత్రిలో మళ్లీ అత్యాచారం!

జంషెడ్‌పూర్ : అత్యాచారానికి గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిపై సదరు ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు మళ్లీ అత్యాచారం చేశాడు! ఈ ఘోరం జంషెడ్‌పూర్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చోటుచేసుకుంది. రెండురోజుల క్రితం ఓ కుర్రాడు తనపై అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టుచేసి రిమాండుకు పంపారు.

అనంతరం ఆ బాలికను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ మళ్లీ ఈ ఘోరం జరిగింది. అసలు నేరస్థుడు తప్పించుకున్నాడని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని సీనియర్ ఎస్పీ అనూప్ టి. మాథ్యూ చెప్పారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.