బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్ ..

– టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డి.
ఊర్కొండ, నవంబర్ 8 (జనంసాక్షి):
మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ధ్యాప వీరారెడ్డి అన్నారు. మంగళవారం ఊర్కొండ మండలంలోని మాదారం గ్రామానికి చెందిన సాకలి బాలయ్య(60) అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. అట్టి విషయాన్ని గ్రామ టిఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, జడ్చర్ల శాసనసభ్యులు డా.చర్లకోల లక్ష్మారెడ్డి బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి 5వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ధ్యాప వీరారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఎల్లప్పుడూ టిఆర్ఎస్ పార్టీ మరియు లక్ష్మారెడ్డి అన్నగారు అండగా ఉంటారని ఎవరికి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తామని అన్నారు. అందజేసిన వారిలో ఉప సర్పంచ్ హుస్సేన్, తెరాస గ్రామ అధ్యక్షులు ఇసాక్, తెరాస సీనియర్ నాయకులు అల్వాల్ రెడ్డి, చికొండ్ర మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.