బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ చేసిన పాఠశాల మిత్రులు

జనం సాక్షి, చెన్నరావు పేటమండలంలోని పాత మగ్దుపురం గ్రామంలో బాధిత కుటుంబానికి మిత్రులు శుక్రవారం బియ్యం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన నాంపల్లి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అతని కుమారుడు సంపత్ పాఠశాల మిత్రులు గ్రామానికి చేరుకొని మృతి పట్ల విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మిత్రుడి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చింతకాయల లక్ష్మీనారాయణ, కన్నం భాస్కర్, మండల మల్లయ్య, మొగులాజి ఈశ్వర్, లక్క స్వామి, నాంపల్లి శ్రీనివాస్, ఒంటరి రాములు, మజ్జిగ కుమారస్వామి, చీకటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు