బాబుకు ఇచ్చిన బీ ఫారాలు పోనూ..  విూకు మిగిలింది 65 సీట్లే!

– మరోసారి జేడీపై విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి
అమరావతి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : జనసేన అధికారంలోకి వస్తుందని, 88 స్థానాల్లో విజయం ఖాయమని విశాఖ లోక్‌సభ అభ్యర్థి, ఆ పార్టీ నేత వీవీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్‌గా శుక్రవారం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి వీవీ కూడా ధీటుగా సమాధానం ఇవ్వడంతో జనసేన, విజయసాయి మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా, వీవీ లక్ష్మీనారాయణ, జనసేనను ఉద్దేశించి విజయసాయి ట్వీట్‌ చేశారు. జేడీ లక్ష్మీనారాయణపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విజయసాయి.. గ్లాసు పార్టీలో విూరేమిటో నాకు తెలియదని, చంద్రబాబుకు విూ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లేనంటూ వరుస ట్వీట్లు చేయడం గమనార్హం. చంద్రబాబుకు విూ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్‌ పాల్‌ బీ ఫారాలు పోగొట్టుకున్నట్టు గానే విూ నాయకుడూ 80 సీట్లలో డవ్మిూలను దింపి ‘త్యాగం’ చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి అంటూ ఎద్దేవా చేశారు. పాపం! బాలక్రిష్ణ చిన్నల్లుడు భరత్‌కు టికెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి మద్ధతు మాత్రం విూకివ్వమని తండ్రీ కొడుకులిద్దరూ కేడర్‌కు చెప్పిన విషయం నిజం కాదా అంటూ జేడీ లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. ఓట్లు చీల్చి జనాలను వెర్రి పుష్పాలు చేసేందుకు వేర్వేరుగా పోటీ చేశారని, విూ చీకటి పొత్తులను ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారంటూ విజయసాయి ధ్వజమెత్తారు. హిస్‌ మాస్టర్‌స్‌ వాయిస్‌ (హెచ్‌ఎంబి) అన్న బిరుదు జేడీ లక్ష్మీనారాయణకు చక్కగా సరిపోతుందన్నారు. తెలుగుదేశంలో చేరాలనుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నాక, విూ బాస్‌ చెప్పినట్టు ఆఖరిక్షణంలో జనసేనలో చేరారు. విూ కమిట్‌మెంట్‌ను అభినందించాల్సిందేనని విమర్శించారు. ఒకటి నుంచి ఐదు అంకెల్లో ఏది లక్కీ నంబరో వెతుక్కుని లెక్కలు వేసుకోండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జేడీ.. విూ నాయకుడు కుప్పం, మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో ఒక మాట అడిగి క్లారిటీ ఇవ్వండి అంటూ ప్రశ్నించారు. 88 సీట్లు గెలుస్తారో లేదో దీన్ని బట్టే తెలిసి పోతుందని, ‘ప్రశ్న ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైతే’ ప్రజలు నిర్దయగా గుణపాఠం చెబుతారని చరిత్ర అనేకసార్లు రుజువు చేసిందంటూ విజయసాయి విరుచుకుపడ్డారు.