బాబుకు మతిభ్రమించింది
– ఓడిపోతాననే భయం ఆయన్ను వెంటాడుతుంది
– అందుకే పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడు
– బాబు రోత చూసి ఆ పార్టీ నేతలే విసిగిపోతున్నారు
– వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్, మే4(జనంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబుకు ఓడిపోతున్నామని తెలిసిపోయిందని, అందుకే చంద్రబాబు ప్రస్టేషన్లో పిచ్చినట్లు మాట్లాడుతున్నాడని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తన పాపాలపుట్ట బద్దలవుతుందన్న భయంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఫొని తుపానును జాగ్రత్తగా తానే పక్కకు తప్పించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు క్యాబినెట్ విూటింగ్ పెట్టి ఏం సాధించారని నిలదీశారు. .కనీసం ఒక్క క్యాబినెట్ విూటింగ్ అయినా భూకేటాయింపులు లేకుండా జరిగిందా అని పద్మ ప్రశ్నించారు. అలాంటిది మరి ఈరోజు క్యాబినెట్ విూటింగ్ పెట్టి ఏ నిర్ణయాలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితి ఉందన్నారు. క్యాబినెట్ విూటింగ్ పెట్టి ఎవరిని పిలుస్తారు. విూ మంత్రులు దాక్కున్నారా. అసలు క్యాబినెట్ మంత్రులు ఎవరూ కనబడటం లేదన్నారు. వారంతా చంద్రబాబు రోత చూసి విసిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఓడిపోతామనే తెలిసి వాళ్లంతా సొంత పనుల్లో ఉన్నారని, ఐదేళ్లుగా అవినీతి, అరాచకాలు చేసి… ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఓటమి భయంతో చంద్రబాబు పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ నవ్వినా ఆయన ఏడుస్తున్నారని, వైఎస్ జగన్కు జీవించే హక్కు లేకుండా చంపాలని చూశారన్నారు. కనీసం ఆయనకు సినిమాకు వెళ్లే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు. టీటీడీ బంగారం వ్యవహారంపై స్పందించని చంద్రబాబు వైఎస్ జగన్ సినిమాకు వెళ్తే మాత్రం మాట్లాడతారన్నారు. విూ లోకేష్ ఎక్కడున్నారో చెప్పండంటూ పద్మ ప్రశ్నించారు. కోడెల ఎదుర్కొన్న పరిస్థితి మరే టీడీపీ నేతలు తెచ్చుకోవద్దని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. రాష్ట్రాన్ని ఐదేళ్ల బ్రష్టుపట్టించారని, ఇప్పుడు సత్యనీతులు చెబుతున్నారని వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.