బాబు జై ఆంధ్రా అన్నట్టా !

గుంటూరు, విజయవాడలను
జంటమెగా నగరాలుగా మలుస్తా
శ్రీహైటెక్‌ హబ్‌ నిర్మిస్తా శ్రీఉద్యోగ అవకాశాలు కల్పిస్తా
శ్రీగుంటూరు పాదయాత్రలో బాబు
గుంటూర్‌ : టీడీపీ అధికారంలోకి వస్తే విజయవాడ, గుంటూర్‌లను జంటనగరాలుగా చేసి ఒక మెగా సీటిగా నిర్మిస్తానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీతో హైటెక్‌ హబ్‌ నిర్మించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. బుధవారం కృష్ణ నుంచి గూంటూర్‌ వరకు పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నా ఆరోగ్యం ఎలా ఉన్నా పేదల కోసం పాదయాత్ర కొనసాగిస్తానని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి వారికే చెల్లిస్తామని చెప్పారు. ఆధార్‌ ద్వారా డుబ్బులు పంపీణీ చెయొద్దని, ఆ డబ్బును కాంగ్రెస్‌ నేతలే కాజేస్తారన్నారు. జగన్‌ జనం సొమ్మును దోచుకోవడం వల్లే అతనికి కోర్టులు బెయిలు ఇవ్వడం లేదని, అతను దోచుకున్న సంపదతో రాష్ట్రంలోని రైతులకు ఐదు సార్లు రుణమాఫీ చేయవచ్చన్నారు. టీడీపీ నాయకులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని కోడెల, యరపతినేనిల కేసులే ఇందుకు నిదర్శనామని ఆయన తెలిపారు.