బారులుతీరిన ఓటర్లు

6kcxsepkబీహార్ లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా 10 జిల్లాల పరిధిలోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అటు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.