బాలికల జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా ఇంటర్ విద్యాధికారిణి

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారిని కల్పన సోమవారం సందర్శించారు. విద్యార్థుల హాజరు నమోదు, సిలబస్, ఇతర అంశాలపై చర్చించి, రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులు అందరూ కళాశాలకు హాజరు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. కళాశాల కు హాజరు కాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ సలీమ్, అధ్యాపకులు విద్యాధికారినిని శాలువతో ఘనంగా సన్మానించారు.