బాలిక మృతిపై నివేదిక ఇవ్వాలి

: కలెక్టర్‌ ఖమ్మం, జూలై 27 : పినపాక మండలం ఎల్‌సిరెడ్డిపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గిరిజన బాలిక పొన్నెబొయిన జానకి మృతి పట్ల సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ఎటిడబ్ల్యుఓను జిల్లా కలెక్టర్‌ సిద్దార్ధజైన్‌ శుక్రవారం నాడు ఆదేశించారు.