బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు.

దౌల్తాబాద్ నవంబర్ 23(జనం సాక్షి )

దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీలకు చెందిన 10 మంది యువకులు మహేందర్, అభిలాష్, చిదుగు భాను, స్వామి, వేణు, కమలాకర్, కరుణాకర్,వెంకటేష్,శివ,నవీన్ యూత్ నాయకులు సయ్యద్ ఖాళీలోద్ధిన్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముత్యం గారి స్వామి, నక్క సురేష్ తదితరులు పాల్గొన్నారు.