బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు.

దౌల్తాబాద్ నవంబర్ 18(జనం సాక్షి )దౌల్తాబాద్ మండల కేంద్రనికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. సయ్యద్ రహిమోద్దిన్ బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, పిఎసిఎస్ డైరెక్టర్ బుడ్డ రమేష్,మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు కేంసారం నాగరాజు , వార్డు సభ్యులు మా శెట్టి నరేష్ గుప్తా,నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.