బిఆర్ ఎస్ తోనే అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్సీవెంకటరామిరెడ్డి

నవంబర్ 14(జనంసాక్షి ) అలంపూర్ నియోజవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మహబూబ్ నగర్ జిల్లా శాసనమండలి సభ్యులు చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు.
మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండలలో చెన్నుపాడు, పెద్ద పోతులపాడు, చిన్న పోతులపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చల్లా వెంకట్రామ్ రెడ్డి ఎమ్మెల్సీ , అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు ప్రచారం చేశారు. ఈసందర్బంగా ఆయా గ్రామాలలో మీ రెస్పాటి కార్యకర్తల ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ రైతు బంధు, బీమా, కరెంట్ ,కళ్యాణ లక్ష్మీ లతో పాటు చాలా సంక్షేమ పథకాలు అమలు చేసి సకలజనుల అభివృద్ధి కి బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు బాటలేసిందన్నారు.
గురుకులాలు,దళిత బందు,బీసీ బంధు,చేప పిల్లల పంపిణీ, గొర్రెల యూనిట్ ల పంపిణీ, గీత కార్మికులు,బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు లాంటి ఎన్నో పథకాలు బీసీ, దళిత,మైనారిటీ వర్గాలకు భద్రతా, భవిష్యత్ ను కల్పించాయన్నారు.
మానవపాడు మండలంలో గ్రామాల సర్పంచులు , ఎంపిటిసిలు, పిఎసియస్ డైరెక్టర్ లు మరియు పార్టీ కార్యకర్తలు ప్రతి పక్షాలకు అవకాశం లేకుండా పార్టీ కోసం పనిచేయాలన్నారు.
మన ప్రాంతం బాగుండాలి బాగుపడాలంటే కెసిఆర్ నాయకత్వాన్ని మరియు అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడుని బారి మెజార్టీతో” గెలిపించాలని పిలుపునిచ్చారు