బిజెపికి వ్యతిరేకంగా దేశం ఏకమవుతోంది: నిమ్మల కిష్టప్ప
న్యూఢిల్లీ,నవంబర్1(జనంసాక్షి): ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ పిలిచినందుకే కాదు, జాతీయ స్థాయిలో అన్ని పక్షాలను ఏకం చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఎంపీ నిమ్మల కిష్టప్ప చెప్పారు. బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు లాంటివారికి బ్యాంక్గ్రౌండ్ తెలియదని, భవిష్యత్ అర్థంకాదని ఆయన ఎద్దేవాచేశారు. ప్రధాని మోదీ పాలనలో ఏపీ ఒక్కటే కాదని, దేశం మొత్తం ఇబ్బంది పడుతోందని చెప్పారు. అందుకే దేశం మొత్తం ఏకమవుతోందని నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. బీజేపీని ఎండగట్టడానికే ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయని, ఏపీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని, టీడీపీని విమర్శించే అర్హత బీజేపీకి లేదని ఎంపీ మాగంటి బాబు అన్నారు.