బిజెపిని మారుమూల గ్రామాల్లో బలోపేతం చేయడమే లక్ష్యం

ఫ్లెక్సీలు చింపి దిగజారకండి
* బిజెపి ఇల్లందు నియోజకవర్గ నాయకులు బోడ పూన్యా నాయక్

టేకులపల్లి, అక్టోబర్ 6( జనం సాక్షి ): భారతీయ జనతా పార్టీని ఇల్లందు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలలో బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను గ్రామాల్లో గడపగడపకు పర్యటిస్తూ వివరించడమే తమ ధ్యేయంగా పనిచేస్తామని ఇల్లందు నియోజకవర్గ బిజెపి నాయకులు బోడ పుణ్యానాయక్ అన్నారు. శుక్రవారం టేకులపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అంచలంచెలుగా ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేక గ్రామాలలో బిజెపి పోస్టర్లను చింపి వేస్తున్నారని, అది వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తారో తెలుపుతూ వారి విశ్వాసాన్ని చూరగొనాలని, అంతేగాని ఎదుటి పార్టీ నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేక అనైతికంగా పిచ్చి చేష్టాలు చేస్తే ఊరుకునేది లేదని, ఫ్లెక్సీలు చింపివేసిన కొందరిని సిసి ఫుటేజ్ ల ద్వారా గుర్తించామని, అలాంటి వారిపై ఫిర్యాదులు కూడా చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మోడీ పదేళ్ల పరిపాలనలో దేశంలో ఎంతో అభివృద్ధి సాధించిందని, తెలంగాణ రాష్ట్రంలో భారీగా పార్టీ పుంజుకున్నదని, అందుకే ఇతర పార్టీలు మారుమూల ప్రాంతాల్లో కూడా బిజెపి పార్టీ రోజు రోజుకి బలోపేతం కావడానికి చూసి సహించలేని కొందరు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వారి దుశ్చర్యలను తిప్పికొడతామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు చిక్కా వెంకటేశ్వరరావు, ధారావత్ ద్రావ