బిజెపి నేతల హంతకులను గుర్తించాం

వారు ఉగ్రవాదులే అన్న గవర్నర్‌

శ్రీనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): జమ్మూకాశ్మీర్‌లోని కిష్వార్‌లో గత వారం బిజెపి నేతలు అనిల్‌ పరిహార్‌, ఆయన సోదరుడు అజిత్‌ పరిహార్‌లు హత్యకు గురికాగా..నిందితులను గుర్తించామని, త్వరలోనే ప్రజల ముదుకు తీసుకువస్తామని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సోమవారం అన్నారు. శ్రీనగర్‌ నుండి సెక్రటరీయేట్‌, కార్యాలయాలు జమ్మూకు తరలిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఈ హత్యలకు కారకులు ఉగ్రవాదులేనని తెలిపారు. నిందితులను గుర్తించామని, త్వరలోనే విూ ముందుకు తీసుకురానున్నామని అన్నారు. గత రెండు నెలల నుండి నిరాశలో ఉన్న ఉగ్రవాదులు ఈ హత్యలకు పూనుకున్నారని తెలిపారు. ఎటువంటి ఘర్షణలు, మరణాలు లేకుండా నాలుగు దశలలో స్థానిక పౌర ఎన్నికలు ముగిసాయని కాశ్మీర్‌లోయ ప్రజలు ఆనందంలో ఉన్నారని తెలిపారు.