బీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్న ప్రజాప్రతినిధులు.

బెల్లంపల్లి, నవంబర్ 24, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి షాక్ ఇస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణానికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు సూరం సంగీత – బానేష్, పత్తిపాక రేణుక – రాజ్ కుమార్, కొమ్ముల సురేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా శుక్రవారం బెల్లంపల్లి వైస్ ఎంపీపీ పసుల రాణి – సురేష్, కన్నెపల్లి మండల కేంద్ర సర్పంచ్ పుల్లూరి రాజయ్య అధికార పార్టీకి షాక్ ఇస్తూ మాజీమంత్రి, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇలా వలస బాట పడుతుండటంతో బెల్లంపల్లి నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి