బీఆర్‌ఎస్‌ పథకాలే….తమకు శ్రీరామరక్ష.

బీఆర్‌ఎస్‌ పథకాలే….తమకు శ్రీరామరక్ష.

తాండూరు అక్టోబర్ 13 (జనం సాక్షి)
సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తాండూరు నియోజకవర్గంలో వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తాండూరు అభివృద్ధి పనులే
అన్నారు. ఈ ఎన్నికల్లో తనకు శ్రీరామరక్షగా నిలుస్తాయని అన్నారు. శుక్రవారం తాండూరు మండలంలోని కరన్‌కోట్,బెల్కటూర్ గ్రామాల్లోని దాదాపు వంద మందికి పైగా‌ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.వారందరికీ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలో తాండూరు నియోజక వర్గంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశానన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని పథకాలు గడపగడపకు చేరవేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలపడానికి రాష్ట్ర ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. తాండూరులో బంపర్ మెజారిటీతో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.