బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు

బెంగళూరు, జనంసాక్షి: బెంగళూరు బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నాలుగు కార్లు, ఒక పోలీస్‌ వ్యాన్‌ దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి ఎనిమిది మంది పోలీసులు సహా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పేలుడు సంభవించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జాగీరాలతో తనిఖీలు జరిపారు. అయితే మోటారు సైకిల్‌ బాంబు పేలడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ధృవీకరించారు.