బీజేపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు షాక్

amit-shah-stor_647y_101915022334సొంత పార్టీ నేతల సచ్చీలతను రుజువు చేయడానికి ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నోట్ల రద్దు నిర్ణయం గురించి బీజేపీ నేతలకు ముందే తెలుసన్న ఆరోపణలకు చెక్ పెట్టాలని మోదీ భావిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ ప్రజాప్రతినిధుల ఖాతా వివరాలను వెల్లడించాలని మోదీ ఆదేశించారు. బీజేపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఖాతా వివరాలను ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. నోట్ల రద్దు తర్వాత, అంటే నవంబర్ 8 నుంచి డిసెంబర్ 1వరకూ జరిగిన లావాదేవీలన్నింటికీ సంబంధించిన వివరాలు వెల్లడించాలని ఆయన సంకేతాలు పంపారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకే ఈ ఖాతాల వెల్లడి నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు.