బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మోడీకి స్థానం

న్యూఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మెడీకి స్థానం అభించింది. నూతన పార్లమెంటరీ బోర్డు వివరాలు బీజేపీ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం న్యూఢిల్లీలో ప్రకటించారు. భాజపా ప్రధాన కార్యదర్శులుగా వరుణ్‌ గాంధీ, అమిత్‌ షాలను నియమించారు. అలాగే స్మృతి ఇరానీ, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, ప్రభాత్‌ ఝూలకు భాజపా ఉపాధ్యాక్షులుగా స్థానం కల్పించారు. అయితే నరేంద్ర మోడీ ఆరేళ్ల తర్వాత మళ్లీ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు సంపాదించుకున్నారు.