బీజేపీ రాజ్యసభ సభ్యులకు విఫ్

పెrajya-sabha759ద్ద నోట్ల రద్దు విషయంలో విపక్షం మొత్తం ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు విఫ్ జారీ చేసింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు సభ్యులంతా సభలోనే ఉండాలంటూ విఫ్ జారీ చేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. అధికార ఎన్డీయేకు రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో ఒక వేల ఓటింగ్ జరిగే పరిస్థితి వస్తే సభ్యులంతా సభలో ఉండాలని బీజేపీ భావిస్తున్నది.