బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాకు గుండెపోటు

dv262cymకోల్‌కతా, సెప్టెంబరు 18 : బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియాకు గుండెపోటు రావటంతో ఆయన్ను కోల్‌కతాలోని బీఎం బిర్లా ఆసుపత్రికి తరలించారు. దాల్మియా వెంట ఆయన కుమారుడు అభిషేక్‌ దాల్మియా ఉన్నారు. దాల్మియాకు ప్రత్యేక వైద్యులు బృందం వైద్యసేవలు అందిస్తోంది. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దాల్మియా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న పశ్చిమబంగా మంత్రి అరువ్‌ బిశ్వాస్‌, భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీలు ఆసుపత్రికి వచ్చారు.