బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ రాజీనామా
బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలిగారు. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం సాధ్యం కాదని భావిస్తున్న మనోహర్.. బోర్డు చీఫ్ పదవిని వదులుకున్నారు. అప్పటి అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరణంతో గత ఏడాది బోర్డు చీఫ్ పదవిని శశాంక్ చేపట్టారు. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా ఉన్న శశాంక్ మనోహర్.. మే 23న మరోసారి ఆ పదవికి ఎన్నిక కావడం లాంఛనంగా మారింది. శశాంక్ రాజీనామాతో బిసిసిఐ కొత్త అధ్యక్షుడిగా శరద్ పవార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ఐతే, ఐసీసీ చైర్మన్ అభ్యర్థిగా ఉండటం వల్లనే శశాంక్ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వివరణ ఇచ్చారు.