బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేస్తాం

హైదరాబాద్‌,జనంసాక్షి: కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చే అంశం కమిసన్‌ చూసుకుంటుందని మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. బీసీ కార్పోరేషన్లను బలోపేతం చేస్తామన్నారు. స్టడీ సర్కిల్‌ విద్యార్థులకు స్టయిఫండ్‌ పెంచుతామన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ కోసం నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.