బీహార్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు రోజురోజుకూ బెడద

బీహార్‌లో పోకిరీలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పాట్నా సహా పలు ప్రాంతాల్లో పోకిరీల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. బస్టాపులు, రైల్వే స్టేషన్లలో మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్య పదజాలంతో దూషించడమే పనిగా కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. తాజాగా పాట్నాలో ఓ పోకిరీ అమ్మాయిలను ఏడిపిస్తుండగా అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ పై కూడా పోకిరీ దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోకిరీకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.