బీహార్‌లో సీనియర్ పాత్రికేయుడి దారుణ హత్య

పాట్నా : బీహార్‌లో సీనియర్ పాత్రికేయుడు దారుణ హత్యకు గురయ్యాడు. శివాన్ రైల్వేస్టేషన్ సమీపంలో రాజ్‌దేవ్ రంజన్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లాయి. రాజ్‌దేవ్ హిందీ దినపత్రిక హిందూస్థాన్‌లో బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. మరోవైపు పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు జార్ఖండ్‌లోని ఛాత్రా జిల్లాలో ఓ జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.