సహోబా: ఉత్తరప్రదేశ్లోని కరవు ప్రాంతమైన బుందేల్ఖండ్ ప్రాంతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మహోబా జిల్లాలోని సుపా గ్రామం నుంచి ఆయన 7 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నేతలతో సహా.. వందల మంది గ్రామస్థులు పాల్గొని ర్యాలీగా బయలుదేరారు. పాదయాత్ర అనంతరం సుపా రైల్వేస్టేషన్లో మహిళా సంఘాల సభ్యులు, లాద్పూర్లోని రైతులను కలిసి సమస్యలు తెలుసుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.