బుధిని నుంచి నామినేషన్ వేసిన సిఎం శివరాజ్సింగ్
17మందితో మరో జాబితా విడుదల చేసిన బిజెపి
భోపాల్,నవంబర్5(జనంసాక్షి): మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ బుధ్ని నియోజకవర్గం నుంచి శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ ప్రకటించింది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మేనల్లుడు అనూప్ మిశ్రాకు భితర్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. ఈ జాబితాలో 17 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. మధ్యప్రదేశ్లో 230 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ 177 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ఈ నెల 2న విడుదల చేసింది. రెండో జాబితాను 17 మంది అభ్యర్థుల పేర్లతో సోమవారం ప్రకటించింది. నెల 28న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది, వచ్చే నెల 11న ఫలితాలను ప్రకటిస్తారు.