బెంగళూరులో మరో నిర్భయ ఘటన: వ్యాన్‌లో నర్సింగ్ విద్యార్థినిపై రేప్!

mvjkgu87ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తరహాలో బెంగళూరులోనూ చోటుచేసుకుంది. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. అరాచకాలకు అడ్డుకట్ట మాత్రం పడట్లేదు. తాజాగా బెంగళూరులో ఓ నర్సింగ్ స్టూడెంట్ కామాంధులకు బలైపోయింది. 
కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట్‌లో మినీ బస్సులో నర్సింగ్‌ విద్యార్థినిపై డ్రైవరు అత్యాచారం జరిపాడు. ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్, క్లీనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని.. ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 
శుక్రవారం ఉదయం బెంగళూరు ప్రధాన నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ బండిని వేరే మార్గంలోకి తీసుకెళ్లి.. నిర్మానుష్యప్రాంతంలో ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని.. అతని వద్ద విచారణ జరుగుతుందని.. నిందితులకు కఠిన శిక్ష పడుతుందని పోలీసులు వెల్లడించారు. కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేందుకు మినీ బస్సు ఎక్కిన విద్యార్థినిపై బస్సులో ఎవ్వరూ లేని సమయంలో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగే సమయంలో క్లీనర్ కూడా అదే బస్సులో ఉన్నాడని పోలీసులు అంటున్నారు.