బెంగళూరు చేకున్న మంత్రి హరీష్‌రావు బృందం

harish-tourమహారాష్ట్రతో జలవివాదాలను పరిష్కరించి అందరి మన్ననలు పొందిన కేసీఆర్ ప్రభుత్వం… కర్ణాటకతోనూ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఆర్టీఎస్ విషయంలో కర్ణాటకతో ఉన్న వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకు మంత్రి హరీశ్ రావు బృందం బెంగుళూరు వెళ్లింది. కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ పాటిల్ తో ఆయన భేటీ కానున్నారు. నీటి వివాదం విషయంలో కూలంకషంగా చర్చించనున్నారు. హరీష్ రావు తో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, జూపల్లితో పాటు నీటిపారుదల శాఖ అధికారులు ఈ బృందంలో ఉన్నారు.