బెంగాల్ అభివృద్ధికి మరింత కష్టపడి పనిచేస్తా

mamatha

బెంగాల్ లో మరోసారి తమకు అధికారం ఇచ్చిన ప్రజలకు తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తామని ఆమె చెప్పారు. విజయం దాదాపు ఖాయం కావటంతో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, లెప్ట్‌ పార్టీలు చేసిన అసత్య ప్రచారాన్ని జనం నమ్మలేదని అన్నారు. ప్రజలిచ్చిన ఈ విజయంతో రాష్ట్రాభివృద్ధికి మరింత కష్టపడి పనిచేస్తామని దీదీ చెప్పారు.