బైక్‌ను ఢీకొన్న బస్సు: వ్యక్తి మృతి

అనంతపురం,మార్చి29(జ‌నంసాక్షి): జిల్లాలోని తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఫ్లై ఓవర్‌ దగ్గర బైక్‌ను బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామాంజనేయులు(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్‌పై
కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.