బోనమెత్తిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.

తాండూరు పట్టణం సాయిపూర్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు.
తాండూరు జులై 24(జనంసాక్షి)ఆషాడమాసా బోనాలు సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని తాతగుడి మరియు కట్టమైసమ్మ ఆలయ బోనాలు పోతారాజుల ఆటపాటలతో,కళాకారుల నృత్యాలతో అంగరంగా వైభవంగా జరిగాయి. తెలంగాణ సాంస్కృతిక బోనాల పండుగ సందర్భంగా తాండూరు మున్సిపల్ వైస్
చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పెద్ద ఎత్తున్న సాయిపూర్ మహిళలతో కలిసి డప్పుసప్పుల వాయిద్యాలతో అమ్మవార్లకు నైవేద్యాలతో కూడిన బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ..పెద్దఎత్తున మహిళలతో బోనాల ఉత్సాహలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని,అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండలాని,ప్రజలాందరు సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సాయిపూర్ ప్రజలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు..