బోరు వేయాలంటూ గ్రామస్థుల ఆందోళన
కడప,జూలై22 (జనంసాక్షి): తమ గ్రామంలో తాగు నీటి బోరును వేయాలంటూ.. చింతకుంటవాండ్లపల్లె గ్రామస్తులు సోమవారం ధర్నా చేపట్టారు. గ్రామంలో తాగు నీటి బోరును వేస్తుంటే.. విద్యుత్ శాఖ అధికారులు అడ్డుకున్నారని, వెంటనే తమ గ్రామంలో తాగు నీటి బోరును వేయాలని డిమాండ్ చేస్తూ.. వేంపల్లె-రాయచోటి ప్రధాన రహదారిలో లక్కిరెడ్డిపల్లె సబ్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి చింతకుంటవాండ్లపల్లె గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సిఐ రామాంజనాయక్, ఎస్సై సురేశ్ లు గ్రామస్తులతో మాట్లాడి రహదారిపై ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.