బ్యాంకుల్లో విత్‌డ్రా పరిమితి కుదింపు

cash-deposit-machineపెద్దనోట్ల రద్దుతో సగటు మనిషి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. వారానికి ఇప్పటివరకూ రూ.24వేలుగా ఉన్న పరిమితి రూ.5వేలకు కుదించినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశముంది. ఇదిలా ఉంటే, ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కరెంట్ ఖాతాదారులకు మాత్రమే రూ.25వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు చెబుతున్నారు. సామాన్యులు పనులు వాయిదా వేసుకుని బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.