బ్యాంక్‌ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

కాకినాడ,మార్చి26(జ‌నంసాక్షి): తుని కరూర్‌ వైశ్య బ్యాంకుకి సంబంధించిన రూ.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మంగళవారం ఉదయం 9 గంటలకు గొల్లప్రోలు చెక్‌ పోస్ట్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కారులో తుని కరూర్‌ వైశ్య బ్యాంకు కి సంబంధించిన రూ.50 లక్షల
నగదును తుని నుండి పెద్దాపురం బ్రాంచికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గొల్లప్రోలు ఎస్సై మాట్లాడుతూ.. తుని కరూర్‌ వైశ్య బ్యాంకు కి సంబంధించిన రూ.50 లక్షల నగదుకు సీజర్‌ రిపోర్ట్‌ రాసి పిఠాపురం ఆర్‌ఒకు పంపిస్తున్నామని తెలిపారు.