బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగాలి:కెఎ పాల్‌

విజయవాడ,జూలై26(జనంసాక్షి):

దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్‌ అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ… దేశంలో బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈవీఏంలు ఉంటే మళ్లీ బీజేపీదే అధికారం అని చెప్పుకొచ్చారు. ప్రజాశాంతిపార్టీలో చేరేందుకు ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. దేశం ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని కేఏ పాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు