బ్లూవేల్‌కు మరో విద్యార్థి బలి

చెన్నై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): బ్లూవేల్‌ గేమింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. పాండిచ్చేరి యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాండిచ్చేరిలో చోటుచేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు..ప్రాథమిక విచారణ ఆధారంగా బ్లూవేల్‌ గేమ్‌ కారణంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించారు. మధురైకి చెందిన విగ్నేష్‌ అనే విద్యార్థి బ్లూవేల్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.