భక్త మార్కండేయ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే……

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
శ్రీ శివ భక్త మార్కండేయ కమిటీ హాల్ శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి స్థానిక బోనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారితో శంకుస్థాపన చేపించడం జరిగింది భువనగిరి పట్టణంలోని అతి పెద్ద కుల సంఖ్య కలిగినటువంటి పద్మశాలీలకు అడగగానే మార్కండేయ స్వామి టెంపుల్ ఫంక్షన్ హాల్ కు 50 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేయించడం జరిగినది కార్యక్రమం భువనగిరి పట్టణ అధ్యక్షులు బింగి బిక్షపతి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో భువనగిరి పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సహాయాలు ఎన్నో జరుగుతాయని జరిపిస్తానని కుల పెద్దలందరికీ మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇట్టి కార్యక్రమంలోని బోనగిరి కి చెందినటువంటి కుల పెద్దలందరూ పాల్గొన్నారు. గౌరవ జిల్లా అధ్యక్షులు చుంచు నాగభూషణం గారు భువనగిరి పట్టణ గౌరవ అధ్యక్షులు ఎలగందుల కాంతయ్య భువనగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్పూలు శ్రీధర్ సహాయ కార్యదర్శి కుమార్ ఉపాధ్యక్షులు అల్లబాలింగం కోశాధికారి బింగి రాములు ప్రముఖ వ్యాపారవేత్త దొంత లక్ష్మణ్ వంగరి లక్ష్మీనారాయణ కొంగరి రవీందర్ సార్ గసిద్దుల పద్మ దొంత సుమిత్ర తదితర కుల పెద్దలందరూ పాల్గొని ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది